గ్రామానికి సమీపంలోని నీటి వనరులను పరిశీలించి, పాడైపోయిన పైపులైన్ల మరమ్మతులు చేయించడంతో పాటు కొత్తగా తాగునీటి సరఫరా ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అవసరమైన చోట బోర్వెల్ మరమ్మతులు, మోటార్ల మార్పిడి వంటి పనులు కూడా చేపట్టి నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూసారు. అదనంగా గ్రామంలో నిల్వ ట్యాంకులను శుభ్రపరిచి, నిరంతరంగా నీటి సరఫరా కొనసాగేందుకు ప్రణాళిక రూపొందించారు.
సర్పంచ్ అనిత చర్యల వల్ల గ్రామ ప్రజలు ఉపశమనం పొందారు. గతంలో నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా, ప్రస్తుతం గ్రామంలోనే తాగునీరు అందుబాటులోకి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వేగంగా పరిష్కరించినందుకు గ్రామస్తులు సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఇలాగే పనిచేస్తానని సర్పంచ్ అనిత తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ఉపేందర్, పంచాయతీ సిబ్బంది పీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
#భద్రాద్రికొత్తగూడెం #పినపాక #సీతారాంపురం #బొమ్మరాసిపల్లి #తాగునీటి సమస్య #సర్పంచ్ అనిత #గ్రామాభివృద్ధి
0 కామెంట్లు