దేశ రాజధాని ఢిల్లీలో ఒక హైటెక్ వ్యభిచార కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. నగరంలోని ప్రముఖ ప్రాంతంలో నడుస్తున్న ఈ రాకెట్ను శనివారం రాత్రి ప్రత్యేక దాడిలో బహిర్గతం చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కేంద్రం ప్రత్యేక విధానంలో
(అంతా నగ్నంగానే లోపలికి రావాలి అనే కండీషన్)
నిర్వహించబడుతూ, అక్కడికి వచ్చే కస్టమర్లకు అసాధారణ నియమాలు అమలు చేస్తున్నట్టు వెల్లడైంది. కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. మహిళల ప్రవర్తన, సేవల ఆధారంగా ధరలు నిర్ణయించేవారని అధికారులు గుర్తించారు.
దాడిలో లక్షల్లో నగదు, మద్యం, కండోమ్స్, విదేశీ సెక్స్ టాయ్స్, మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రాన్ని భార్యాభర్తలు నిర్వహిస్తున్నారని, వారికి తోడు పలువురు మేనేజర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు.
పట్టుబడ్డ వారిలో ఒక మైనర్ బాలిక ఉండటం ఆందోళన కలిగించే విషయం. అక్కడ లభించిన రిజిస్టర్లో వందలాది కస్టమర్ల వివరాలు నమోదై ఉండగా, అందులో పలువురు సంపన్నులు, హైప్రొఫైల్ వ్యక్తులు ఉన్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
0 కామెంట్లు