వరంగల్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన గర్జనకు పిలుపు.
గుండాల మండలం ఏప్రిల్ 12 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తేదీన వరంగల్లోని కాకతీయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న డాక్టర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు ఈసారి కేవలం సాంప్రదాయ కార్యక్రమం కాదని పేర్కొన్నారు. బహుజనుల ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన కోసం సాగుతున్న పోరాటానికి ఇది ఆరంభంగా నిలవబోతుందని బహుజన సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు బొమ్మెర రాంబాబు, యనగంటి సంపత్ తెలిపారు.
రాష్ట్రంలో బహుజన వర్గాలకు చెందిన వెనుకబడిన తరగతులు, అనుసూచిత జాతులు, అనుసూచిత తెగలు మరియు ముస్లిం మైనారిటీలు ఇంకా ప్రాథమిక అవసరాలకే పరిమితమై జీవిస్తున్న దుస్థితి కొనసాగుతుండటం పాలక ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని వారు మండిపడ్డారు. అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు బహుజనుల అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
వరంగల్లో నిర్వహించనున్న బహుజన గర్జన కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి విద్యావంతులు, మహిళలు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
0 కామెంట్లు