భద్రాచలం, మార్చి 27 (ఎస్బి న్యూస్):
భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాలు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సదుపాయాలను పటిష్టం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ దుర్గాభవాని 108 అంబులెన్స్ను పరిశీలించారు. అంబులెన్స్లో ఉన్న అత్యవసర వైద్య పరికరాలు, ఆక్సిజన్ సదుపాయం, ప్రథమ చికిత్స సామగ్రి వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు.
భక్తులకు అత్యవసర సమయంలో వేగంగా వైద్య సహాయం అందేలా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆమె సూచించారు. ఉత్సవాల సమయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, 108 సిబ్బంది పాల్గొన్నారు.
హ్యాష్ట్యాగ్స్:
#Bhadrachalam #SriRamaNavami #108Ambulance #HealthServices #తెలంగాణాన్యూస్ #sbnews
0 కామెంట్లు