- ఎమ్మెల్యే ని కలిసిన షాదిఖాన చైర్మన్ యాకూబ్ అలీ
కారేపల్లి : కారేపల్లి షాదీఖానా అభివృద్ధికి సహకరించాలని వేరే ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ను షాదీఖానా చైర్మన్ మహమ్మద్ యాకూబ్ అలీ కోరారు. శనివారం షాదిఖాన కమిటి బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు అనంతరం వైరా ఎమ్మెల్యేను కారేపల్లి షాదీఖానా కమిటీ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షాదిఖానా చైర్మన్ యాకుబ్ అలీ మండలంలోని మైనారిటీల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు యాకూబ్ అలీ తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ మజీద్ పాషా (షేరు), మండల మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండీ హనీఫ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, నాయకులు షేక్ షఫీ, షేక్ యాకుబ్ పాషా, షేక్ ఖదీర్, షేక్ జానీ, గుగులోత్ భీముడు, కృష్ణ, గుగులోత్ మంగ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్లు