అల్లపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం మార్కోడు పంచాయతీ సుద్దరేవు గ్రామంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో ఆదివాసీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా భావిస్తున్న గిరిజనులు వర్షాలు కురవాలని తమ కులదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వర్షాభావంతో నష్టపోయిన పంటలను ప్రభుత్వం పరిశీలించి నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.
0 కామెంట్లు