వితంతువులు 18 ఏళ్లు పైబడి భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఒంటరి మహిళలు 18 ఏళ్లు పైబడి, భర్త వదిలేసిన వారు లేదా విడాకులు పొందిన వారు అర్హులు. దివ్యాంగులకు కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. కళాకారులు, చేతివృత్తుల కార్మికులు 50 ఏళ్లు పైబడి సంబంధిత శాఖ ధ్రువీకరణ కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైలేరియా, గుర్తింపు పొందిన డయాలసిస్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్ బాధితులు కూడా అర్హులని ఎంపీడీవో తెలిపారు. అర్హులు గడువులోగా దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
0 కామెంట్లు