సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
మక్కా నుంచి మదీనా వైపు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు అంటుకొని దుర్ఘటన చోటుచేసుకుంది.
*ఈ ప్రమాదంలో మొత్తం 42 మంది భారతీయులు సజీవదహనమైనట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది*.
మృతులలో హైదరాబాద్కు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నట్టు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
మరణించిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు ప్రారంభ దర్యాప్తులో తెలుస్తోంది.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Social Plugin