ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం


కరకగూడెం మండలంలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరలను శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిళలతో మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి కుటుంబానికి సహాయపడే విధంగా అందిస్తున్న చీరలు పండుగ సందర్భాల్లో ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళలు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు స్పందన చూపుతుండటం ఆనందకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.