ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని అంచనా. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
🔴 రెడ్ అలర్ట్ జిల్లాలు: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నాగర్కర్నూల్
🟠 ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు: హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్
🟡 ఎల్లో అలర్ట్ జిల్లాలు: మిగిలిన 11 జిల్లాలు
తుపాను ప్రభావంతో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Social Plugin